పుట్టినప్పడు ఉయ్యాల అవుతా..
శ్వాసకు ఊపిరి అవుతా..
గూడును అయ్యి రక్షణ అవుతా..
పోయినప్పుడు కాడెను అవుతా…
ఇంతా చేసి మనిషి స్వార్థానికి
మాత్రం బలవుతున్నా..
ఇదీ చెట్టమ్మ గోడు..విచక్షణారహితంగా నరికివేతకు గురవుతున్న చెట్ల అరణ్య రోదనపై కవి, గాయకుడు కార్తీక్ కొడకండ్ల రాసి, ఆలపించిన గేయం..చెట్ల అవసరాన్ని, మానవుడికి అవి ఉపయోగపడుతున్న విధానాన్ని పాట రూపంలో ఆలపించిన కార్తీక్ వీడియోను గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త ఎంపీ జోగినపల్లి సంతోష్కుమార్ ట్విట్టర్ ద్వారా అందరితో పంచుకున్నారు.
అత్యంత సున్నితంగా మనిషికి ప్రకృతి, చెట్ల అవసరాన్ని చెప్పిన ఈ పాట తనను కదిలించిందని, కళ్లలో నీళ్లు తెప్పించిందని ఎంపీ సంతోష్కుమార్ పేర్కొన్నారు. ఈ కవి హృద్యమైన తపన అందరికీ కనువిప్పు కావాలన్నారు. చెట్ల నరికివేత తగ్గడం, మొక్కలు నాటడం ద్వారా పచ్చదనం పెంచడం మన జీవన విధానం కావాలని ఎంపీ సంతోష్కుమార్ ఆకాక్షించారు.
This sensible creation brought tears into my eyes. An artist’s interpretation on anything will be unique. ThankYou @Karthik_Kodaks garu for penning such a beautiful words about a #Tree. Goosebumps. This should be an eye-opener to all of us & act to work towards a better tomorrow. pic.twitter.com/9LYzsaqPM3
— Santosh Kumar J (@MPsantoshtrs) July 14, 2022