హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ): గ్రీన్ ఇండియా చాలెంజ్ సంప్రదాయాన్ని నిబద్ధతతో కొనసాగిస్తామని గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు, ఎంపీ సంతోష్కుమార్ తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా గ్రీన్ చాలెంజ్ కార్యక్రమంలో భాగంగా బంజారాహిల్స్ పార్క్లో ఎంపీ మొక్కలు నాటారు. కొత్త సంవత్సరంలో ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. పచ్చదనం, ఆరోగ్యకర వాతావరణం కోసం ప్రతి ఒక్కరూ పుట్టినరోజులతోపాటు వివిధ సందర్భాల్లో మొక్కలు నాటాలని కోరారు. మర్రి, రావి, చింత వంటి మొక్కలను నాటడం ద్వారా వేగంగా పెరిగి వివిధ జాతుల పక్షులు, జంతువులకు నీడ, ఆశ్రయం కల్పిస్తాయని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా అనేక రంగాల ప్రముఖుల నుంచి సాధారణ ప్రజల వరకూ గ్రీన్ చాలెంజ్లో పాల్గొన్నట్టు చెప్పారు.