హైదరాబాద్ : భారత్ రాష్ట్ర సమితి పార్టీ ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎంఐఎం అధినేత, హైదరాబాద్ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీగా రూపాంతరం చెందినందుకు కేసీఆర్కు శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ఓవైసీ తన ట్వీట్లో పేర్కొన్నారు.
కొత్తగా ప్రారంభమైన ఆ పార్టీకి ప్రత్యేక శుభాకాంక్షలు చెబుతున్నట్లు ఓవైసీ పేర్కొన్నారు. దేశ ప్రజల అభ్యున్నతిని కాంక్షిస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్ నూతన జాతీయ పార్టీని ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర సమితి పేరునే భారత్ రాష్ట్ర సమితిగా మారుస్తూ ఆయన అధికారి ప్రకటన చేశారు.
Congratulations to @TelanganaCMO on @trspartyonline’s transformation into a national party. My best wishes to the party on their new beginning.
— Asaduddin Owaisi (@asadowaisi) October 5, 2022