హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): బల్క్డ్రగ్స్ పార్క్ ల మంజూరు విషయంలో కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ సభను తప్పుదోవ పట్టించారని లోక్సభలో బీఆర్ఎస్ పక్షనేత నామా నాగేశ్వరరావు ఆరోపించారు. మంత్రి మన్సుఖ్పై సభా హక్కుల నోటీస్ ఇస్తామని స్పష్టంచేశారు. కేంద్ర ప్రభుత్వం గుజరాత్, హిమాచల్ప్రదేశ్తోపాటు హైదరాబాద్కు బల్క్డ్రగ్స్ పార్క్లను మంజూరు చేసిందని, ఇందుకు రూ.1,000 కోట్లు అవసరమని అంచనా వేశామని, తొలి విడతలో ఒక్కొక్కదానికి రూ.300 కోట్ల చొప్పున విడుదల చేస్తామని శుక్రవారం లోక్సభలో తెలిపిన మంత్రి మన్సుఖ్.. లిఖితపూర్వక సమాధానంలో మాత్రం గుజరాత్, హిమాచల్ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలకు బల్క్డ్రగ్ పార్క్ను మంజూరు చేసినట్టు పేర్కొన్నారని నామా వివరించారు. కేంద్ర మంత్రులే లోక్సభను తప్పుదోవ పట్టిస్తున్నారని, సభ గౌరవాన్ని తగ్గ్గించే విధంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేం ద్ర మంత్రి తప్పుదోవ పట్టించారనడానికి అవసరమైన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, లోక్సభ టీవీలో ప్రసారమైన క్లిప్పింగ్స్, లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానాలు ఇందుకు సాక్ష్యంగా ఉన్నాయని పేర్కొన్నారు. బాధ్యతాయుతంగా సమాధానాలు ఇవ్వాల్సిన కేంద్ర మంత్రి లోక్సభ అంటే కనీస గౌరవం, మర్యాద లేకుండా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని మండిపడ్డారు. కేంద్ర మంత్రి రెండు రకాల సమాధానాలు ఇవ్వడం దురదృష్టకరమని అన్నారు.
తెలంగాణపై వివక్ష
అంతకుముందు నామా నాగేశ్వరరావు లోక్సభలో మాట్లాడుతూ.. హైదరాబాద్కు బల్క్డ్రగ్ పార్క్ మంజూరు విషయంలో కేంద్రం వివక్ష చూపుతున్నదని, జాప్యం చేస్తున్నదని విమర్శించారు. బల్డ్రగ్ పార్ కోనం తెలంగాణ ప్రభుత్వం నిర్ణీత సమయంలోనే కేంద్రానికి దరఖాస్తు చేసిందని, అయినా మంజూరులో ఎందుకు వివక్షత చూపిస్తున్నారని ప్రశ్నించారు. దేశంలోనే అత్యున్నత ప్రమాణాలు, వసతులు కలిగిన హైదరాబాద్ నగరం ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు ఎంతో అనువైనదని, గతంలోనే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఈ విషయమై పలుమార్లు కేంద్రానికి లేఖలు రాశారని గుర్తు చేశారు. కరోనా పరిస్థితుల్లోనూ దేశానికి భారీఎత్తున వ్యాక్సిన్లను సరఫరా చేసిన చరిత్ర హైదరాబాద్కు ఉన్నదని చెప్పారు. ఈ అంశంపై కేంద్రం పార్లమెంట్ సాక్షిగా అబద్ధపు ప్రకటన చేసి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని మండిపడ్డారు. కేంద్రం ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలంగాణకు బల్డ్రగ్ పార్ ప్రాజెక్టును ఇస్తున్నట్టుగా ఎకడా పేరొనలేదని, కానీ పార్లమెంట్లో సంబంధిత మంత్రి తెలంగాణకు ప్రాజెక్టు ఇస్తున్నట్టుగా ప్రకటన చేశారని వివరించారు. అసలు తెలంగాణకు బల్డ్రగ్ పార్ ప్రాజెక్టును మంజూరు చేస్తున్నారో, లేదో స్పష్టం చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.