హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని జోనల్ రైల్వే వినియోగదారుల సంప్రదింపుల కమిటీ (జడ్ఆర్సీసీసీ) సభ్యుడిగా లోక్సభలో బీఆర్ఎస్ పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు నియమితులయ్యారు.
పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ఆదేశాల మేరకు దక్షిణ మధ్య రైల్వే డిప్యూటీ జనరల్ మేనేజర్ కే ముత్యాలనాయుడు సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు. నామా ఈ పదవిలో 2025 జనవరి 31 వరకు కొనసాగుతారు. రైల్వే వినియోగదారులకు మరింత సేవ చేయడానికి కృషి చేస్తానని నామా నాగేశ్వరరావు పేరొన్నారు.