సూర్యాపే : ప్రభుత్వ కార్యక్రమంలో వీధి రౌడీగా ప్రవర్తించిన మంత్రి కోమటిరెడ్డి కోమటిరెడ్డి(Minister Komati Reddy) చర్య ప్రజస్వామ్యానికి గొడ్డలిపెట్టు లాంటిదని, ఇలాంటి దుర్మార్గపు చర్య ఇప్పటి వరకు ఏ మంత్రి చేయలేదని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్(MP Lingaiah Yadav) ఫైర్ అయ్యారు. యాదాద్రి భువనగిరి జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి దాడి(ZP Chairman Sandeep Reddy)పై ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీల అమలును ప్రశ్నించినందుకే దాడి చేశారని ఆరోపించారు. మంత్రి అనే సోయిలేకుండా నిందించడం హేయమైన చర్య అని మండిపడ్డారు. ప్రోటోకాల్ వ్యక్తి పై పోలీసులను అడ్డం పెట్టుకుని అరాచకం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలను రెచ్చగొట్టి పోలీసులతో ఏకమై గుండాయిజం చేస్తారా? అని ప్రశ్నించారు. ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలియకుండా కోమటిరెడ్డి ప్రవర్తిస్తున్నాడన్నారు.
కాంగ్రెస్ ఆటవిక పాలనతో ప్రజల ఆగ్రహానికి గురవుతుందన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఇలాంటి చర్యలకు ఎప్పుడు పాల్పడలేదని గుర్తు చేశారు. ఒళ్లు దగ్గరపెట్టుకుని ప్రవర్తించాలని సూచించారు. ఇలాంటి చర్యల వల్ల పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కి పరాభవం తప్పదన్నారు. అహంకారంతో వ్యవహరించడం కోమటిరెడ్డి మానుకోవాలని, మా నాయకులను అవమానిస్తే ప్రతి చర్య తప్పదని హెచ్చరించారు.