హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ): మొక్కలు నాటి మాతృభూమిని అందంగా తీర్చిదిద్దుదామని రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ టోలిచౌకిలోని తన నివాసంలో మొక్కనాటి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. ప్రతిఒక్కరూ గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా మొక్కలు నాటాలని కోరారు. ‘కొత్త సంవత్సరాన్ని ప్రారంభించడానికి మొక్క నాటడం కంటే మెరుగైన మార్గం కనిపించలేదు. కొవిడ్ మహమ్మారి మధ్య న్యూ ఇయర్ 2022 మరింత ఆశాజనకంగా ఉండాలనే ఆశతో నా వంతు కృషి చేసినందుకు సంతోషంగా ఉన్నది. మాతృభూమిని మరింత అందంగా తీర్చిదిద్దుదాం. హ్యాపీ న్యూ ఇయర్’ అని ట్వీట్ చేశారు.