హైదరాబాద్ : చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా ఆదివారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ రంజిత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. అలాగే పలువురు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ఎంపీ రంజిత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.