హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యాలో చిక్కుకున్న 12 మంది భారతీయులను రక్షించి స్వస్థలాలకు తీసుకురావాలని ఎంఐ ఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ బుధవారం కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జయశంకర్ను కోరారు. వీరిలో తెలంగాణ నుంచి ఇద్దరు, కర్ణాటక నుంచి ముగ్గురు ఉన్నారని, వారంతా రష్యాలో నానా అవస్థలు పడుతున్నారని తెలిపారు.