తెలంగాణ, హైదరాబాద్కు టీ హబ్ రెండో దశ మరో కలికితురాయి అని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. టీ హబ్ రెండో దశ ప్రారంభంపై మంగళవారం ఆయన ట్వీట్ చేశారు. దేశంలోనే తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు.
తెలంగాణ, హైదరాబాద్ దేశంలోనే అత్యంత ప్రగతిశీల రాష్ట్రం, నగరంగా మారుతున్నాయని అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. అత్యాధునిక సాంకేతికత, ఆవిష్కరణలకు హైదరాబాద్ విశ్వకేంద్రం మారాలని ఆశిస్తున్నానని తెలిపారు.
Another feather in Hyderabad’s & Telangana’s cap! Easily India’s most progressive city & state. Hope to see Hyderabad become a GLOBAL hub of innovation & cutting edge tech https://t.co/rFCwHRK4OG
— Asaduddin Owaisi (@asadowaisi) June 28, 2022