హైదరాబాద్ : ఎమ్మెల్సీ కవితకు ఎంపీ ధర్మపురి అర్వింద్ క్షమాపణలు చెప్పాలని టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు డిమాండ్ చేశారు. కవితపై అర్వింద్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఎంపీ తన నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు. తెలంగాణ ప్రజలందరూ తమ ఆడబిడ్డగా భావించి గౌరవించే కవితపై పిచ్చి ప్రేలాపనలు చేస్తే తాము చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక అర్వింద్ చిల్లర ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.
టీఆర్ఎస్.. బీఆర్ఎస్గా రూపాంతరం చెందుతుందని, తద్వారా తమ బతుకులు రోడ్ల మీద పడతాయని భావించి అక్కసుతోనే ఎమ్మెల్సీ కవితపై నోరుపారేసుకున్న అర్వింద్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ కవితపై మరోసారి నోరుజారితే భౌతికదాడులు తప్పవని ఆయన హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమంలో ప్రజలంతా రోడ్ల మీదుంటే అర్వింద్ ఇంట్లో దాక్కొన్న వ్యక్తి తెలంగాణ ఉద్యమం కోసం అహర్నిశలు పాటుపడిన కవితపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని విమర్శించారు.