MP Arvind | బోధన్, ఫిబ్రవరి 29: పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఉం టుందో.. పోతుం దో తెలియదని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్రెడ్డి కుర్చీని లాక్కునేందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సిద్ధంగా ఉన్నారని, కోమటిరెడ్డి నుంచి గుంజుకునేందుకు ఉత్తమ్కుమార్రెడ్డి కాచుకు కూర్చున్నారని వ్యాఖ్యానించారు.
నిజామాబాద్ జిల్లా బోధన్లోని నిజాం షుగర్స్ ఎదుట గురువారం చెరుకు రైతులతో అర్వింద్ మాట్లాడుతూ…ఎన్నికలకు ముందు కేసీఆర్ సర్కార్ రూ.7 వేల కోట్లు రైతుబంధు నిధులు ఉంచితే.. వాటిని బిల్లుల రూపంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తీసుకున్నారని ఆరోపించారు. నిజాం షుగర్స్ పునరుద్ధరణ విషయంలో కాంగ్రెస్ సర్కార్ స్పష్టత ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నదని మండిపడ్డారు.