హైదరాబాద్ : పార్లమెంట్ ఎన్నికల్లో(,Parliament elections) మాదిగలకు(Madigas) రెండు సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు (Motkupalli Narsimhulu) డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో మాదిగలకు జరుగుతున్న అన్యాయాన్ని నిరిసిస్తూ గురువారం బేగంపేట(Begumpet) లీలానగర్లోని తన నివాసంలో దీక్ష(Deeksha) చేపట్టారు.
కాంగ్రెస్లో మాదిగలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. బీఆర్ఎస్, బీజేపీ రెండేసి టికెట్లు కేటాయించారని కాంగ్రెస్ ఎన్ని టికెట్లు ఇచ్చిందని ప్రశ్నించారు. మంద కృష్ణ మాదిగ మాట్లాడిన దాంట్లో తప్పు లేదన్నారు. మా జాతికి జరుగుతున్న అన్యాయాలపై ఆయన సరిగానే స్పందించారని చెప్పారు. గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశా ఎన్నడూ ఇంత అన్యాయం జరుగలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగాలని తాను మాట్లాడటం లేదని, తాను పార్టీ మారే ప్రసక్తేలదన్నారు. పార్టీ ఇప్పటికైనా గుర్తించి తప్పును సరిదిద్దుకోవాలన్నారు. కాగా, గతంలో మంద కృష్ణ మాదిగ కూడా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు. మాదిగలకు అన్యాయం చేస్తే ఊరూరా తిరిగి ఆ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని హెచ్చరించిన విషయం తెలిసిందే.