హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్పై మోత్కుపల్లి నర్సింహులు ప్రశంసల వర్షం కురిపించారు. రాష్ట్ర ప్రజలకు మంచి నాయకుడు కావాలి.. పేదలను ఆదుకునే నాయకుడు కావాలి.. అలాంటి నాయకుడు సీఎం కేసీఆర్ మాత్రమే అని నర్సింహులు స్పష్టం చేశారు.
టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా ట్యాంక్బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి, బషీర్బాగ్లోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి, గన్పార్కులో అమరవీరుల స్థూపానికి మోత్కుపల్లి నర్సింహులు నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇవాళ తనకు సంతోషకరమైన దినం అని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాను. కానీ కేసీఆర్ లాంటి సీఎంను చూడలేదు. రాష్ట్రంలో పేదరికాన్ని రూపుమాపేందుకు దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారు. రైతును రాజు చేసేందుకు రైతుబంధు ఇస్తున్నారు. ప్రతి వర్గానికి సీఎం కేసీఆర్ అండగా ఉంటూ.. ఆదుకుంటున్నారు అని మోత్కుపల్లి నర్సింహులు పేర్కొన్నారు.