గుమ్మడిదల : బైక్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టిన ఘటనలో తల్లీ కూతుళ్లు దుర్మరణం పాలయ్యారు. మరో రెండు సంవత్సరాల బాలుడు తీవ్ర గాయాలకు గురయ్యాడు. ఈ సంఘటన గుమ్మడిదల పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. స్థానికులు, ఎస్ఐ విజయకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం గుమ్మడిదల గ్రామానికి చెందిన బ్రహ్మచారి ఉదయం ఓ శుభకార్యానికి భార్య కల్పన (35), కూతురు శివానీ(4), కుమారుడు కార్తీక్ (2)తో బైక్ వెళ్లారు. కార్యక్రమం అనంతరం తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో జాతీయ రహదారి 765 దోమడుగు యూటర్న్ వద్ద బైక్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది.
ఈ ఘటనలో భార్య, కూతురు అక్కడికక్కడే మృతి చెందారు. కార్తీక్కు తీవ్ర గాయాలవగా.. బ్రహ్మచారి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని తీవ్రగాయాలకు గురైన బాలుడిని సమీపంలోని దవాఖానకు తరలించారు. తల్లీకూతుళ్ల మృతదేహాలను పటాన్చెరు ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.