న్యూఢిల్లీ: పెట్రోలే కాదు ఇప్పుడు పాలు కొనడం కూడా సామాన్యునికి భారంగా మారింది. ప్రముఖ అమూల్, మదర్ డెయి రీలు వివిధ రకాల పాల ప్యాకెట్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటిం చాయి. ఈ పెరిగిన కొత్త ధరలు మే 14 నుంచి అమలులోని వస్తాయిని తెలిపాయి. ఫుల్ క్రీమ్ మిల్క్, టోన్డ్ మిల్క్, ఆవు పాలు, గేదె పాలు, ప్రీమియం వేరియంట్లపై ఈ ధరలు పెంపుదల ఉండనుంది.
ఉత్పత్తి, ప్యాకెట్ పరిమాణాన్ని బట్టి పెరుగుదల రూపాయి నుంచి ఐదు రూపాయల వరకూ ఉండనుంది. గుజరాత్ కో ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎం ఎంఎఫ్) ద్వారా మార్కెట్ అయ్యే అమూల్.. పలు క్యాటగి రీలలో లీటరుపై రూపాయి నుంచి రెండు రూపాయల వరకూ పెంచు తున్నట్లు ప్రకటించింది.
సవరించిన ధరల ప్రకారం అమూల్ గోల్డ్(ఒక లీటరు) ధర రూ. 68 నుంచి రూ.70కి పెరిగింది. అమూల్ తాజా (ఒక లీటరు) ధర రూ. 55 నుంచి రూ. 57కు చేరుకుంది. ఇక మదర్ డెయిరీ విషయానికొస్తే గేదె పాలు ఒక లీటరు రూ. 75 నుంచి రూ.80కి పెరిగింది. మిగిలిన వేరియట్ల ధరలలో కూడా పెరుగుదల చోటుచేసుకుంది. నిర్వహణ, సేకరణ ఖర్చులు పెరగడం, రవాణా ఛార్జీలు అధికం కావడం, ప్యాకేజీ ఖర్చులు తడిసి మోపెడవడంతో పాల ధరలను పెంచుతున్నట్లు ఈ రెండు డెయిరీలు తెలిపాయి.