Bhadradri | హైదరాబాద్ : భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణోత్సవం తలాంబ్రాలకు( Sitaramula Kalyanotsava Talambralu ) ఈ ఏడాది భలే డిమాండ్ పెరిగింది. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది 20 వేల మంది అధికంగా తలాంబ్రాలను బుక్ చేసుకున్నారు. టీఎస్ ఆర్టీసీ( TSRTC ) ద్వారా తలాంబ్రాలు బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పించగా, భక్తుల నుంచి అపూర్వమైన స్పందన లభించింది.
తొలి దశలో 50 వేల మందికి తలాంబాల్రను డెలివరీ చేయనుంది ఆర్టీసీ. ఆదివారం నుంచే ఈ ప్రక్రియ ప్రారంభమైంది. డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో బుకింగ్స్కు అవకాశం కల్పిస్తూ గడువును ఏర్పిల్ 10వ తేదీ వరకు పొడిగించారు. ఆర్టీసీ ద్వారా బుకింగ్ చేసుకున్న భక్తులకు తలాంబ్రాలను రెండు, మూడు రోజుల్లో అందజేయనున్నారు.
తొలి బుకింగ్ చేసుకున్న ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్( VC Sajjanar ).. ఆదివారం బస్ భవన్( Bus Bhavan )లో తలాంబ్రాలను అందుకున్నారు. ఈ సందర్భంగా సజ్జనార్ మీడియాతో మాట్లాడుతూ.. భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణోత్సవం తలాంబ్రాల కోసం భక్తుల నుంచి భారీగా బుకింగ్స్ వస్తున్నాయని చెప్పారు. గతేడాది 88 వేల మంది బుక్ చేసుకోగా, ఈ ఏడాది లక్ష మందికి పైగా బుక్ చేసుకున్నట్లు సజ్జనార్ తెలిపారు.
భద్రాద్రి తలాంబ్రాలు కావాలనుకునే వారు.. టీఎస్ ఆర్టీసీ కార్గో పార్శిల్ కౌంటర్ల వద్ద బుక్ చేసుకోవచ్చు. 9177683134, 7382924900, 9154680020 నంబర్లను సంప్రదించొచ్చు అని సూచించారు.
భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణోత్సవ తలంబ్రాలకు భక్తుల నుంచి మంచి డిమాండ్ వస్తోంది. ఇప్పటివరకు ఒక లక్ష మందికి పైగా తలంబ్రాల కోసం బుకింగ్ చేసుకున్నారు. మొదటి విడతలో 50 వేల మంది భక్తులకు #TSRTC తలంబ్రాలను హోండెలివరీ చేస్తోంది. ఈ ముత్యాల తలంబ్రాలను ఈ రోజు స్వీకరించడం జరిగింది. pic.twitter.com/TvHBoUj0Mz
— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) April 3, 2023