ఆత్మకూరు, మే 15: ఏటీఎం నుంచి డబ్బుల వర్షం కురిసింది.. వంద డ్రా చేస్తే.. రూ.500 నోట్లు వచ్చాయి. ఈ ఘటన వనపర్తి జిల్లా అమరచింత లోని ఇండియా వన్ ఏటీఎంలో శనివారం చోటుచేసుకున్నది. గుర్తించిన కొం దరు విషయాన్ని గోప్యం గా ఉంచి అదేపనిగా డబ్బులు డ్రాచేశారని తెలుస్తున్నది. విషయం ఆనోట.. ఈనోట పోలీసులకు చేరింది. ఏటీఎం వద్దకు వెళ్లి పెద్దసంఖ్యలో గుమిగూడిన ప్రజలను పం పించారు. అనంతరం ఏటీఎంను సీజ్చేసి నిర్వాహకులకు సమాచారమిచ్చారు. ఏటీఎం నిర్వాహకులు వెళ్లి పరిశీలించగా మొత్తం 5.20లక్షలు డ్రా అయినట్లు గుర్తించారు. సీసీ కెమెరా ఆధారంగా ఎంతమంది, ఎన్ని అకౌంట్ల ద్వారా డబ్బులు డ్రా చేశారన్నది విచారణ చేస్తున్నట్టు సమచారం. కాగా, బ్యాంకు అధికారుల విజ్ఞప్తి మేరకు డబ్బులు డ్రా చేసుకొన్న పలువురు దాదాపు రూ.లక్ష వరకు తిరిగి ఇచ్చినట్టు తెలిసింది