న్యాల్కల్: ఓ కొండముచ్చు విద్యుదాఘాతానికి గురై మృతిచెందగా, గ్రామస్తులు సాంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు చేశారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని హద్నూర్ గ్రామంలో ఆదివారం జరిగింది.
గ్రామ చింతల్ చేరి లో కొండముచ్చు విద్యుత్ స్తంభాన్ని ఎక్కే ప్రయత్నంలో ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురైంది. అక్కడికక్కడే మృతిచెందింది. దీంతో గ్రామస్తులు, రైతులు కలిసి కొండముచ్చు మృతదేహాన్ని ఊరేగింపు తీసుకెళ్లి, సాంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు బక్కారెడ్డి, శ్రీశైలం, గుండప్ప, రాజన్ , బసిరెడ్డి, ఈశ్వర్, గుండారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.