కృష్ణ కాలనీ, మే 1: కోతుల దాడిలో ఒకరు మృతి చెందిన ఘటన జయశంకర్ భూపాలపల్లిలో జరిగింది. సీఐ నరేశ్కుమార్ కథనం ప్రకారం.. భూపాలపల్లి పట్టణంలోని జవహర్ కాలనీలో నివసించే కొసనగొట్టు హరికృష్ణ(50)పై గురువారం కోతులు దాడి చేశాయి. వాటి నుంచి తప్పించుకునేందుకు పరిగెత్తుతుండగా కిందపడి తలకు తీవ్ర గాయాలయ్యాయి.
చికిత్స కోసం భూపాలపల్లిదవాఖానకు, అక్కడి నుంచి వరంగల్లోని ఎంజీఎం దవాఖానాకు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ హరికృష్ణ మృతి చెందాడు. కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ పేర్కొన్నారు.