హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ): తెలంగాణ హజ్ కమిటీ ఆధ్వర్యంలో నాంపల్లిలో హజ్ యాత్రికులకు జూన్ 3న శిక్షణ శిబిరాన్ని నిర్వహించనున్నట్టు చైర్మన్ మహ్మద్ సలీమ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
యాత్రలో అనుసరిం చాల్సిన నియమాలు, ప్రయాణ ముందస్తు జాగ్రత్తలు తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారని చెప్పారు. జూన్ 7 నుంచి జూన్ 22వ తేదీ వరకు యాత్రికులు హైదరాబాద్ నుంచి హజ్కు విడతల వారీగా ప్రయాణ మవుతారని వివరించారు.