న్యూఢిల్లీ: ఫ్లోర్ లీడర్ నామా నాగేశ్వరరావు(Nama Nageshwar Rao) నాయకత్వంలో లోక్సభలో స్పీకర్ వెల్లోకి దూసుకెళ్లి.. ఇవాళ బీఆర్ఎస్ ఎంపీలు(BRS MPs) ఆందోళన చేపట్టారు. పార్లమెంట్ వాయిదా అనంతరం విపక్ష ఎంపీల మద్దతుతో గాంధీ విగ్రహం(Gandhi Statue) ఎదుట పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఎంపీలు ధర్నా నిర్వమించారు. అదానీ అంశంపై జేపీసీ(JPC) వేసి, పార్లమెంట్ లో చర్చకు అనుమతించేంత వరకు అవిశ్రాంతంగా పోరాటం కొనసాగిస్తామని ఎంపీ నామా నాగేశ్వరరావు తెలిపారు. అదానీ – హిండెన్ బర్గ్ అంశం(Adani-Hindenberg issue)పై తక్షణమే సంయుక్త పార్లమెంటరీ కమిటీని వేసి, నిజాలు నిగ్గు తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు.
అదానీ స్కామ్పై జేపీసీ వేయాలని కోరుతూ.. పార్లమెంట్ ఆవరణలో బీఆర్ఎస్ ఎంపీల నిరసన.. pic.twitter.com/WOPbYfO7Yu
— Namasthe Telangana (@ntdailyonline) March 17, 2023
మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని(Democracy) ఖూనీ చేస్తోందని ఎంపీ నామా నాగేశ్వరరావు ఆరోపించారు. ప్రజా ప్రతినిధులమంతా దేశ రాజధానిలో న్యాయం కోసం రోడ్ల మీదకు వచ్చి ఉద్యమిస్తుంటే ప్రధాని మోదీ తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండటం దారుణమన్నారు. ప్రజా ప్రాముఖ్యత ఉన్న అదానీ అంశంపై చర్చ జరపాలని కోరడంలో న్యాయం ఉంన్నారు.
ఎంపీల ఆందోళనల నేపధ్యంలో పార్లమెంట్ సాక్షిగా వాస్తవాలు ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రధాని మోదీ(PM Modi)కి ఉందని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. ఇప్పటికైనా ప్రధాని మోదీ స్పందించి వాస్తవాలు ప్రజలముందుంచాలని ఆయన డిమాండ్ చేశారు.గాంధీ విగ్రహం వద్ద జరిగిన ప్రదర్శనలో సేవ్ ఎల్ఐసీ(Save LIC) బ్యానర్తో ఆయన నిరసన చేపట్టారు.