హైదరాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్లకు కట్టబెట్టి దేశాన్ని లూటీ చేస్తున్నదని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధానకార్యదర్శి బీ వెంకట్ మండిపడ్డారు. దీన్నుంచి ప్రజలను రక్షించడానికి దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్లోని సంఘం రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సీఐటీయూ, రైతుసంఘం, వ్యవసాయ కార్మిక సంఘం సంయుక్త సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కార్మికులందరికీ కనీస వేతనం రూ. 26వేలు చెల్లించాలని, నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్చేశారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని విస్తరింపజేయాలని కోరారు. కనీస మద్దతు ధరల చట్టాన్ని తీసుకురావాలన్నారు. ధనవంతులు, కార్పొరేట్ల పన్నులను మరింత పెంచాలని, అందుకు పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాసర్, తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర కార్యదర్శి టీ సాగర్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్ వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు.