విధానంలేని బీజేపీ సర్కారు
ఆర్థిక వ్యవస్థ మెరుగుకు తీసుకోవాల్సిన చర్యలు తెలియవు
జీఎస్టీపై మాట తప్పిన కేంద్రం
ఓపెన్ టాక్లో ఆర్థిక నిపుణులు
హైదరాబాద్, ఫిబ్రవరి 9, : కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంటుకు సమర్పించి న బడ్జెట్ 2022-23 అభివృద్ధి నిరోధకంగా ఉన్నదని ఆర్థిక నిపుణులు అన్నారు. పడికట్టు పదాలతో ప్రజల ను మోసం చేయటంతప్ప చెప్పుకోవటానికి ఏమీలేద ని వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రభుత్వ వైఖరి వల్లనే కేంద్ర, రాష్ర్టాల మధ్య విభేదాలు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. కేంద్రం సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా వ్యవహరించటాన్ని ముఖ్యమంత్రులు ప్రశ్నిస్తున్నార ని, తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఇదే విషయాన్ని ఇటీవల లేవనెత్తారని గుర్తుచేశారు. బడ్జెట్పై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో బుధవారం ఓపెన్ సోషల్ ఫోరంలో వర్చువల్గా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో సెంట్ర ల్ యూనివర్సిటీ ఎకనామిక్స్ ప్రొఫెసర్ ఆర్వీ రమణమూర్తి ముఖ్యవక్తగా ప్రసంగించారు. బడ్జెట్లో అంకె ల గారడీతో డాంభికంగా చెప్పుకోవడమే తప్ప ప్రజల కు ఉపయోగపడేది ఏమీ లేదని అన్నారు.
జీఎస్టీపై మాట తప్పిన కేంద్రం
దేశంలో జీఎస్టీని ప్రవేశపెట్టినప్పుడు దీనివల్ల రాష్ర్టాలకు జరిగే నష్టానికి పరిహారం చెల్లిస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని, ఇప్పుడేమో అప్పుగా ఇస్తామంటూ మాట మార్చిందని రమణమూర్తి విమర్శించారు. రాష్ర్టాల నుంచి తీసుకోవడమే తప్ప ఇచ్చేది ఏమీ ఉం డటం లేదని పేర్కొన్నారు. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని ముఖ్యమంత్రులు ప్రశ్నిస్తున్నారని గుర్తుచేశా రు. ‘కేంద్రం ఆదాయాన్ని పెంచుకోవడానికి జీఎస్టీ వసూళ్లు, పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపైనే ఆధారపడ టం వల్ల ప్రజలపై పెను భారం పడుతున్నది. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్పరం చేయడం, ఆస్తుల అమ్మ కం వల్ల నిరుద్యోగం మరింత పెరుగుతున్నది’ అని విమర్శించారు.
ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే ప్రణాళికే లేదు.
జీడీపీలో 11 శాతం అభివృద్ధిపై ఖర్చు పెట్టడం వల్ల ప్రయోజనం ఉండదని రమణమూర్తి అన్నారు. అనేక దేశాలు జీడీపీలో 20 శాతాన్ని అభివృద్ధిపై ఖర్చు పెడుతున్నాయని తెలిపారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని విమర్శించారు. కరోనా కాలంలో ప్రభుత్వం, ప్ర జలు విపరీతంగా నష్టపోయినా ప్రైవేటు సంస్థలు మా త్రం లాభపడ్డాయని పేర్కొన్నారు. విపత్కర పరిస్థితు ల్లో ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి ఒక వ్యూహమంటూ లేదని, కేంద్ర ఆర్థిక వ్యూహకర్తలకు ఆర్థిక వ్య వస్థను బాగుపరిచే వ్యూహాలు తెలియవని మండిపడ్డా రు. కార్యక్రమానికి అంబేద్కర్ వర్సిటీ సామాజిక శాస్ర్తాల విభాగం డీన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి అధ్యక్షత వహించగా, వే డాక్టర్ కృష్ణారెడ్డి పాల్గొన్నారు.