రవీంద్రభారతి, ఆగస్టు 14: బీసీ వర్గానికి చెందిన ప్రధాని నరేంద్రమోదీ పదవీ కాలం లో కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయలేకపోయారని రాష్ట్ర ఆబ్కారీశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ విమర్శించారు. రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించి పం పిన బీసీ రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్లో వెంటనే ఆమోదించాలని, లేదంటే రాష్ర్టాలకు రిజర్వేషన్లు కల్పించే అధికారం ఇవ్వాలని కోరారు.
రవీంద్రభారతిలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 372 జయంతి వేడుకల్లో మంత్రి మాట్లాడారు. కొన్ని రాజకీయపార్టీల నేతలు బీసీలు రాజకీయంగా ఎదగకుండా అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో సాహిత్య అకాడమీ చైర్మన్ గౌరీశంకర్, తెలంగాణ బీసీ కమిషన్ సభ్యుడు కే కిశోర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.