వరంగల్ జిల్లా నర్సంపేట వ్యవసాయ మార్కెట్ ఆవరణలో శుక్రవారం ఆధునిక వ్యవసాయ యంత్రాలను ప్రదర్శించారు. ఈ ప్రదర్శనను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, కలెక్టర్ ప్రావీణ్య పరిశీలించారు.
అనంతరం ఎమ్మెల్యే పెద్ది మాట్లాడుతూ.. రైతులకు పైలట్ ప్రాజెక్టు కింద సీఎం కేసీఆర్ రూ.150 కోట్లు ఆధునిక వ్యవసాయ పరికరాలను మంజూరు చేశారని, అందులో నర్సంపేటకే రూ.75 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. ఇందులో సబ్సిడీ పోనూ రూ.37.5 కోట్లు మంజూరైనట్టు చెప్పారు.