మాదిగలకు ఎంపీ టికెట్లు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ఆరోపిస్తూ బుధవారం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ పాత బస్టాండ్ చౌరస్తాలో ఎమ్మార్పీఎస్ నాయకులు సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.
రాష్ట్రంలో 12 శాతానికిపైగా ఉన్న మాదిగలకు పార్లమెంట్ స్థానాల్లో అవకాశం కల్పించకుండా కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిందని విమర్శించారు. దళితుల్లో 20 శాతం ఉన్న గళ్ల మాలలకు రెండు సీట్లు కేటాయించిన రేవంత్రెడ్డి, దళితుల్లో 75 శాతం ఉన్న మాదిగలకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు.
– ఇచ్చోడ