జగిత్యాల, నవంబర్ 12(నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్తో దేశంలో విప్లవాత్మక పాలన మొదలవుతుందని, సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ బంగారుమయమైనట్టు బీఆర్ఎస్ ద్వారా దేశంలో అలాంటి మా ర్పు సాధ్యం అవుతుందని ఎమ్మెల్సీ కల్వకుం ట్ల కవిత స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లా రాయికల్లో శనివారం నిర్వహించిన టీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి ఆమె హాజరయ్యారు. రామగుండంలో ఎరువుల కర్మాగారం ప్రారంభోత్సవం పేరుతో ప్రధాని మోదీ ఖాళీ చేతులతో రాష్ర్టానికి వచ్చారని, ఉత్తుత్తి మాటలు చెప్పి వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు.
ఉత్త మాటలు చెప్పేవాళ్లేవరో.. అభివృద్ధి చేసే నాయకులెవరో ప్రజలు గ్రహించాలని కోరారు. కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ పాదయాత్ర చేసుకుంటూ తెలంగాణకు వచ్చి న సమయంలో మునుగోడు ఎన్నికలు జరుగుతున్నా.. అటువైపు చూడకుండా ప్రజలకు మొహం చాటేశారని గుర్తు చేశారు. రాహుల్గాంధీ చేపట్టేది జాడో యాత్రనా.. జోడో యాత్రనా.. అంటూ ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో ఒడిదొడుకులు ఉంటాయని, అయినా అనుకున్న లక్ష్యం సాధించే వరకు వెంట పడేవారే నాయకులవుతారని, వారే చివరి మజిలీ వరకు చేరుకుంటారని అన్నారు.
తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు కొన్ని ఒడిదొడుకు లు ఎదురైనా ఏనాడూ విశ్వాసం కోల్పోకుం డా లక్ష్యం సాధించారని గుర్తు చేశారు. తప్పకుండా తెలంగాణ వస్తదని.. వచ్చిన తెలంగాణ అభివృద్ధి జరుగుతుందని భరోసా ఇస్తూ అందరినీ ఒకతాటిపై నడిపించిన నాయకత్వ పటిమ ఆయనదన్నారు. కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి, టీఆర్ఎస్ ప్రభు త్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పనులు ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సమయం ఆసన్నమవుతున్న తరుణంలో కొం తమంది కావాలనే గందరగోళం సృష్టిస్తున్నారని, వాట్సాప్లలో దొంగ సందేశాలు పెడుతున్నారన్నారు.
పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని, ఇబ్బంది పెట్టే మెసేజీలు పెడుతున్నారని, ఆ మోసాలను ఎండగట్టాల్సిన బాధ్య త కార్యకర్తలు, నాయకులపై ఉందన్నారు. సీఎం కేసీఆర్ వరదలాగా నిధులు ఇస్తున్న విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని పిలుపునిచ్చారు. కాగా, జగిత్యాల జిల్లా అభివృద్ధిలో ఎమ్మెల్సీ కవిత కృషి అనన్యమైందని ఎమ్మెల్యే సంజయ్కుమార్ పేర్కొన్నారు. నిజామాబాద్ ఎంపీగా కవిత బాధ్యతలు తీసుకున్న తర్వాతే జగిత్యాల నియోజకవర్గానికి, జిల్లాకు మహర్దశ వచ్చిందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, జడ్పీ చైర్పర్సన్ వసంత పాల్గొన్నారు.