ప్రజాప్రతినిధులకు హెల్త్కార్డులు ఇవ్వాలి
మంత్రి ఎర్రబెల్లికి ఎమ్మెల్సీ
పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి వినతి
హైదరాబాద్, ఫిబ్రవరి 22 : జిల్లా, మండల పరిషత్లకు బడ్జెట్లో గ్రాంట్ను పెం చాలని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుకు విజ్ఞప్తిచేశారు. ఈమేరకు మంగళవారంవినతిపత్రం అందజేశారు. బడ్జెట్ను రూ.500 కోట్ల నుంచి రూ.750 కోట్లకు పెంచాలని కోరారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు హెల్త్కార్డులు జారీచేయాలని పేర్కొన్నారు. ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించడం ద్వారా నిమ్స్లో ఉచిత వైద్యం పొందేందుకు వీలవు తుందన్నారు. ప్రతిపాదనలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి అమలుకు కృషిచేస్తానని ఎర్రబెల్లి హామీ ఇచ్చారని ఎమ్మెల్సీ తెలిపారు.