కరీంనగర్ : టీఆర్ఎస్ నాయకుడు పాడి కౌషిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వడం పట్ల హర్షిస్తూ హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో టీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. పటాకులు కాలుస్తూ, స్వీట్లు పంచి పెడుతూ తమ సంతోషాన్ని పంచుకున్నారు. కౌషిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా ఎంపిక చేయడంతో ఈ ప్రాంత అభివృద్ధికి ఆయన మరింత కృషి చేసే అవకాశం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గం ప్రజల తరఫున టీఆర్ఎస్ శ్రేణులు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.