వేముల వాడ టౌన్ మే23 : వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారిని సోమవారం ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు ఆశీర్వచనం చేయగా ఆలయ ఈవో రమాదేవి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. వారి వెంట రాజన్న సిరిసిల్ల జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు తోట ఆగయ్య, వేములవాడ టీఆర్ఎస్ నాయకులు రామతీర్థపు రాజు, శ్రీకాంత్, కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు.