హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): వైఎస్సార్టీపీ నేత షర్మిల బీజేపీతో చీకటి ఒప్పందం చేసుకొని, తెలంగాణలో ప్రధాని మోదీ ఏజెంట్గా పనిచేస్తున్నారని ఎమ్మెల్సీ రాజేశ్వర్రావు ఆరోపించారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో అల్లకల్లోలం సృష్టించే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. గురువారం నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్సన్తో కలిసి టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయం లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో షర్మిల పాదయాత్రకు బీజేపీ జనాలను సమీకరిస్తున్నదని ఆరోపించారు. నర్సంపేట ఘటనపై షర్మిల డ్రామాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
షర్మిల వైఎస్ ఎజెండా అని చెప్తూ.. మోదీ ఎజెండాను అమలు చేస్తున్నారని అన్నారు. వేలాది మైనారిటీ సంస్థలను మూసి వేసిన మోదీతో ఎలా చేతులు కలుపుతారని? షర్మిలను ప్రశ్నించారు. మోదీ క్రైస్తవుల వ్యతిరేకి అని, దేశంలో మైనారిటీలను లేకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారని నామినెటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్ సన్ ఆరోపించారు. సీఎం కేసీఆర్ అన్ని మతాలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారని కొనియాడారు. కేసీఆర్ను విమర్శించే హకు షర్మిలకు లేదన్నారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లపై రంగనాథ్ మిశ్రా కమిషన్ సిఫార్సులను మోదీ ప్రభుత్వం వ్యతిరేకించడం దుర్మార్గమని అన్నారు.