హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా మంత్రి హరీశ్రావు ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలందరి ఆశలు, ఆకాంక్షలకు అద్దంపట్టేలా ఉందని, అభివృద్ధి, సంక్షేమాలకు పట్టం కడుతూ సబ్బండ వర్గాలకు సమ న్యాయం చేసేలా సమగ్రంగా ఉందని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సమతూకంగా రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా నిధుల కేటాయింపు జరిగిందన్నారు. పల్లె, పట్టణ ప్రగతికి భారీగా నిదులు కేటాయించడమే గాక, నేరుగా మున్సిపాలిటీ, గ్రామపంచాయతీలకు వేస్తామని చెప్పడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. 80వేల పోస్టుల భర్తీవేగంగా జరుగుతుండగా. 95శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇస్తూ.. కొత్త ఉద్యోగులకు అదనంగా రూ.1000 కోట్లు కేటాయించారన్నారు.
కాంట్రాక్టు ఉద్యోగులకు ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పారని, రైతు బంధు, దళిత బంధు, రైతుబీమాతో పాటు రైతుల రుణమాఫీ కోసం రూ.90వేల వరకు పూర్తి అయ్యేలాగా బడ్జెట్ కేటాయింపులు జరపడం, హౌసింగ్ శాఖను ఆర్అండ్బీ విలీనం చేయడం, కొత్త ఇండ్ల పథకానికి రూ.12వేల కోట్లు కేటాయించడం తదితర అంశాలు ఈ బడ్జెట్కి హైలైట్గా నిలుస్తాయని పోచంపల్లి అన్నారు. తెలంగాణ ఆచరిస్తోందని, దేశం అనుసరిస్తోంది అనడానికి నిదర్శనం ఈ బడ్జెట్ అన్నారు. అందుకు తగ్గట్లుగానే, జీడీపీ, జీఎస్డీపీ దేశం కంటే తెలంగాణ రాష్ట్రందే ఎక్కువగా ఉండటం గర్వించదగ్గ విషయమన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావుకి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.