హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పథకాలు దేశమంతా అమలుకావాలనేదే తమ లక్ష్యమని ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. ఖమ్మంలో బీఆర్ఎస్ సభ సందర్భంగా ఆయన మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడారు.
తెలంగాణలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఎకరాకు రూ. పది వేల రైతు బంధు ఇస్తున్నామని, ఇది యునెస్కో మెచ్చుకున్న అద్భుతమైన పథకం అని తెలిపారు. రూ. 65వేల కోట్లను డైరెక్ట్గా రైతుల ఖాతాల్లో వేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పారు.