హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): కొన్ని రోజులుగా తనపై వస్తున్న అసత్య ఆరోపణలను ఎమ్మెల్సీ నవీన్కుమార్ తీవ్రంగా ఖండించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తన గురించి మీడియా, సోషల్ మీడియాల్లో జరుగుతున్న ప్రచారం అంతా అవాస్తమని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తనకు ఫోన్ ట్యాపింగ్తో ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు. ఈ వ్యవహారంలో తనపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అవాస్తవాలను ప్రచారం చేయవద్దని సూచించారు. తన గెస్ట్హౌస్ సహా తన ఇంట్లో ఎలాంటి తనిఖీలు జరగలేదని పేర్కొన్నారు. తనపై కుట్రపూరితంగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నవారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.