హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల పరిరక్షణ, కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా ఏర్పడిన టీబీజీకేఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సింగరేణి కార్మికులకు ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. బొగ్గు గనులను ప్రైవేటుపరం చేసి, సింగరేణి సంస్థను నిర్వీర్యం చేయడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుటిల యత్నాలకు వ్యతిరేకంగా, కార్మికుల పక్షాన టీబీజీకేఎస్ కొట్లాడుతుందని ట్వీట్ చేశారు.
‘తెలంగాణకు మణిహారం సింగరేణి బొగ్గు గనుల పరిరక్షణ, కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా ఏర్పడిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సింగరేణి కార్మికులందరికీ శుభాకాంక్షలు. అహర్నిశలు శ్రమించి, దేశానికి వెలుగులు పంచుతున్న సింగరేణి కార్మిక కుటుంబాల సంక్షేమం కోసం టీబీజీకేఎస్ నిరంతరం కృషి చేస్తుంది. బొగ్గు గనులను ప్రైవేటుపరం చేసి, సింగరేణి సంస్థను నిర్వీర్యం చేయడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుటిల యత్నాలకు వ్యతిరేకంగా, కార్మికుల పక్షాన టీబీజీకేఎస్ కొట్లాడుతుంది.’ అని ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్లో పోస్టు చేశారు.
టీబీజీకేఎస్ నిరంతరం కృషి చేస్తుంది. బొగ్గు గనులను ప్రైవేటుపరం చేసి, సింగరేణి సంస్థను నిర్వీర్యం చేయడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుటిల యత్నాలకు వ్యతిరేకంగా, కార్మికుల పక్షాన టీబీజీకేఎస్ కొట్లాడుతుంది.2/2
— Kavitha Kalvakuntla (@RaoKavitha) January 27, 2023