హైదరాబాద్: తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య పాలనవైపు అడుగులేసిన తెలంగాణ నేడు సమైక్యతా దినోత్సవం జరుపుకుంటున్నది. స్వరాష్ట్రంగా మారి సీఎం కేసీఆర్ సారథ్యంలో ప్రగతి పథంలో పయనిస్తూ దేశంలో నంబర్ వన్గా మారిందని ట్విట్టర్ వేదికగా ప్రజలకు శుభాకాంక్షాలు తెలిపారు.
‘రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య పాలన వైపు అడుగులేసిన తెలంగాణ నేడు సమైక్యతా దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు. స్వరాష్ట్రంగా మారి సీఎం కేసీఆర్ సారథ్యంలో ప్రగతి పథంలో పయనిస్తూ దేశంలో నంబర్ వన్గా మారింది. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తోంది. స్వాతంత్ర్య సమరయోధులు, కవులు, కళాకారులను సన్మానిస్తూ, అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ప్రగతిని ప్రజలకు వివరిస్తూ.. జాతీయ సమైక్యత, సమగ్రత ఉట్టిపడేలా కార్యక్రమాలు నిర్వహిస్తూ చరిత్రలో నిలిచిపోయేలా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను నిర్వహించుకోవడం కేవలం కేసీఆర్ విశాల దృక్పథం వల్లే సాధ్యమైంది.’ అని ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు.
రాచరిక పాలన నుండి ప్రజాస్వామ్య పాలన వైపు అడుగులేసిన తెలంగాణ నేడు సమైక్యతా దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు.
స్వరాష్ట్రంగా మారి సీఎం శ్రీ కేసీఆర్ గారి సారథ్యంలో ప్రగతి పథంలో పయనిస్తూ దేశంలో నంబర్ వన్ గా మారింది 1/3— Kavitha Kalvakuntla (@RaoKavitha) September 17, 2022
జాతీయ సమైక్యత, సమగ్రత ఉట్టిపడేలా కార్యక్రమాలు నిర్వహిస్తూ చరిత్రలో నిలిచిపోయేలా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను నిర్వహించుకోవడం కేవలం కెసిఆర్ గారి విశాల దృక్పథం వల్లే సాధ్యమైంది.
3/3
— Kavitha Kalvakuntla (@RaoKavitha) September 17, 2022