నిజామాబాద్ : విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో నిన్న బోధన్ బీసీ హాస్టల్లో (Bodhan BC Hostel) మరణించిన హర్యాల వెంకట్ (Venkat) కుటుంబ సభ్యులను మంగళవారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha), మాజీ ఎమ్మెల్యే జాజల సురేందర్తో కలిసి పరామర్శించారు. జిల్లాలోని గాంధారి మండలం తిప్పారం తండాకు చేరుకున్న చేరుకున్న కవిత వెంకట్ సభ్యులను ఓదార్చారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ హాస్టళ్లలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. బాధిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించి, ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం వెంకట్ కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేశారు. బాధిత కుటుంబానికి అండగా నిలుస్తామని భరోసానిచ్చారు.
కాగా, నిన్న విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో వెంకట్ మృతి చెందిన సంగతి తెలిసిందే. పరీక్షలు ఉన్నందున చదువుకోవాలని వెంకట్ విద్యార్థులకు సూచించాడు. దీంతో ఇంటర్ విద్యార్థులు, వెంకట్ మధ్య మాట మాట పెరిగి ఘర్షణకు దిగారు. వెంకట్ను ఇంటర్ విద్యార్థులు గొంతు నులిమి హత్య(Degree student died) చేశారు.