నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలోని చారిత్రాత్మక కట్టడం ఖిల్లా రామాలయాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం సందర్శించారు. ఎమ్మెల్యేలు బిగాల గణేష్ గుప్తా, జీవన్ రెడ్డిలతో కలిసి ఆలయ పరిసరాలను పరిశీలించారు. చారిత్రాత్మక నేపథ్యం ఉన్న ఈ రామాలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ సందర్శించారు. అనంతరం రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.