జగిత్యాల : ధర్మపురి(Dharmapuri)లోని శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారిని ఆదివారం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి కొప్పుల ఈశ్వర్తో కలిసి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వేదభూమి అయిన ధర్మపురి క్షేత్రం ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందన్నారు. తెలంగాణ రాష్ట్రం వేగంగా సర్వతోముఖాభివృద్ధి సాధించాలని, స్వామి వారి దయ అందరిపై ఉండాలని ప్రార్థించానని ఆమె తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి ఎంతో కృషి చేసిందన్నారు.