Kavitha | ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ప్రతి ఒక్క కుటుంబం ఆనందంతో వెల్లివిరుస్తోందని ఎమ్మెల్సీ కవిత సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు కవిత ట్వీట్ చేశారు. తన ట్విట్టర్లో నిజామాబాద్ జిల్లా నాళేశ్వర్కు చెందిన ఓ రైతును ఉటంకించారు. నాళేశ్వర్కు చెందిన బాగాజి పోశెట్టి తన అర ఎకరంలో రైతుబంధు పెట్టుబడితో వ్యవసాయం చేస్తున్నాడని, పింఛన్ డబ్బుతో ఎంతో సంతోషంగా జీవిస్తున్నారంటూ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు.