నేటి నుంచి 27 వరకు కేరళలో నిర్వహణ
హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): జాతీయ మహిళా లెజిస్లేచర్ కాన్ఫరెన్స్కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఆహ్వానం అందింది. బుధవారం నుంచి శుక్రవారం వరకు కేరళలో జరిగే సదస్సులో ఆమె పాల్గొంటారు. ‘నిర్ణయాత్మక విభాగాల్లో మహిళల పాత్ర’ అనే అంశంపై కవిత ప్రసంగిస్తారు.
ఉత్తరాఖండ్ అసెంబ్లీ స్పీకర్ రీటా ఖండూరీ, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ సంస్థ ప్రతినిధి అన్నీ రాజా ఎమ్మెల్సీ కవితతో కలిసి ప్రసంగించనున్నారు. ఈ సెషన్కు కేరళ ఎంపీ రేమ్మా హరిదాస్ సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా తిరువనంతపురంలో కేరళ అసెంబ్లీ ఈ సదస్సును నిర్వహిస్తున్నది. ఈ నెల 27న ‘నిర్ణయాత్మక విభాగాల్లో మహిళల ప్రాతినిధ్యం’ అంశంపై కూడా ఎమ్మెల్సీ కవిత ప్రసంగిస్తారు. పలు రాష్ర్టాల నుంచి మహిళా ప్రజాప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతారు.