MLC Kavitha | జంతర్మంతర్లో మొదలైన పోరాటం దేశమంతా వ్యాపించాలని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. మహిళా బిల్లు (Women’s Reservation Bill) ఓ చారిత్రక అవసరమని, దానిని సాధించి తీరాలని చెప్పారు. బీజేపీ (BJP) బిల్లు పెడితే అన్ని పార్టీలు మద్దతిస్తాయన్నారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్తో ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలోని (Delhi) జంతర్మంతర్ వద్ద దీక్ష చేస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారత సంస్కృతిలో మహిళకు పెద్దపీట వేశారన్నారు. అమ్మానాన్న అంటారు.. అందులో అమ్మ శబ్ధమే ముందు ఉంటుంది. రాజకీయాల్లోనూ మహిళకు సముచిత స్థానం దక్కాలని స్పష్టంచేశారు. దీక్షకు మద్దతు తెలుపుతున్న అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
Women's Reservation bill is important & we need to bring it soon. I promise all women this protest will not stop until the bill is introduced. This bill will help in development of nation. I request the BJP-led central govt to introduce this bill in parliament: BRS MLC K Kavitha pic.twitter.com/UtB0xzuXEy
— ANI (@ANI) March 10, 2023
మహిళా రిజర్వేషన్ బిల్లు చాలా కాలంగా పెండింగ్లో ఉన్నదని, 1996లో నాటి ప్రధాని దేవేగౌడ (Devegowda) హయాంలో బిల్లు పెట్టినా ఇంకా చట్టం కాలేదని చెప్పారు. ప్రస్తుతం పార్లమెంటులో బీజేపీ ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ ఉందని చెప్పారు. అందువల్ల బిల్లు పెడితే అన్ని పార్టీలు మద్దతు ఇస్తాయన్నారు. మహిళాబిల్లు ఓ చారిత్రక అవసరమని, సాధించి తీరాలని స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ సాధించే వరకూ విశ్రమించేది లేదని వెళ్లడించారు. దేశంలోని మహిళలందరిని కలుపుకొని పోరాడుతామన్నారు. ధరణిలో సగం, ఆకాశంలో సగం అనే తెలుగు నానుడి ఉన్నది. అందుకే అవకాశాల్లోనూ సగం కావాలని కోరుతున్నామని చెప్పారు. దీక్షకు మద్దతు తెలుపుతున్న అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
Bharat Rashtra Samithi MLC K Kavitha leads a one-day hunger strike in national capital to seek the introduction of the Women's Reservation Bill in the current Budget session of Parliament. Sitaram Yechury, CPI(M) General Secretary also present at the protest. pic.twitter.com/39TNIS14X8
— ANI (@ANI) March 10, 2023