హైదరాబాద్: మహిళలపై దాడి చేయడం ఆపాలని బీజేపీకి (BJP) ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) సూచించారు. మహిళల గురించి తప్పుడు వ్యాఖ్యానాలతో అవహేళన చేయడం మానుకోవాలని స్పష్టం చేశారు. వ్యక్తిత్వహరణం చేయడం ఆ పార్టీకి అలవాటుగా మారిందని మండిపడ్డారు. సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్)లో తెలంగాణ బీజేపీ చేసిన ఓ ట్వీట్పై కవిత ఘాటుగా స్పందించారు.
కాలంచెల్లిన మూస పద్ధతిలో మహిళలను అవహేళన చేయడం తగదని స్పష్టం చేశారు. మహిళలు ఉన్నత స్థానానికి చేరుకోవడం బీజేపీ ఓర్వలేక పోతున్నదా అని ప్రశ్నించారు. మహిళల హక్కుల గురించి మాట్లాడుతున్న వారి గొంతు నొక్కడానికి కాషాయ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు హాస్యాస్పదంగా ఉన్నాయని స్పష్టంచేశారు. ఇప్పటికైనా ఇతరులపై నిందలు వేయడం మానుకొని పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును (Women’s Reservation Bill) ఆమోదించడానికి కృషి చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.
It's disappointing but not surprising to see the @BJP4Telangana's attack on me, that perpetuates outdated stereotypes about women.
The amount of time that the BJP is investing on silencing voices of dissent, is amusing.
However, Actions speak louder than cartoons, so believe… https://t.co/ngxtguitBq
— Kavitha Kalvakuntla (@RaoKavitha) August 24, 2023