హైదరాబాద్: పెద్దపేగు క్యాన్సర్పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. క్యాన్సర్తో యువత ప్రాణాలు కోల్పోవడం బాధకలిగిస్తున్నది చెప్పారు. మహిళలు ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానలో జరిగిన క్యాన్సర్ అవగాహన కార్యక్రమానికి ఎమ్మెల్సీ కవిత ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చిన్న పిల్లలకు కూడా పెద్దపేగు క్యాన్సర్ వస్తున్నదని చెప్పారు. పాశ్చాత్య మాయలో పడి ఆహార నియామాలు పాటించడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు.
పర్యావరణ హితం కోసం ప్రభుత్వం పార్కులు, ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేసిందన్నారు. జిల్లా కేంద్రాల్లో పెద్దపేగు క్యాన్సర్పై అవగాహన కల్పిస్తామని చెప్పారు. దేశంలోనే హైదరాబాద్ మెడికల్ హబ్గా ఉందన్నారు.
Regular medical check ups are the key for a healthy life. #ColonCancer is detectable, treatable, preventable and beatable.
Attended #CareForColon Awareness initiative by @AIGHospitals earlier today.
Stay safe. Stay healthy. pic.twitter.com/jgnV8IV9hD
— Kavitha Kalvakuntla (@RaoKavitha) April 23, 2022
పెద్దపేగు క్యాన్సర్ వల్ల అనేక మంది చనిపోతున్నారని ఏఐజీ దవాఖాన చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి అన్నారు. ప్రజలకు పెద్దపేగు క్యాన్సర్పై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు.