MLC Kavitha | జగిత్యాల : కొండగట్టు ఆంజనేస్వామి అనుగ్రహంతో రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆకాంక్షించారు. కొండగట్టు ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం, అక్కడ నిర్వహించిన హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమంలో కవిత పాల్గొన్నారు.
హనుమాన్ చాలీసా పారాయణం ముగిసిన అనంతరం కవిత మాట్లాడారు. మంచి జీవితాన్ని ప్రసాదించేటటువంటి, ఆనందాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చేటటువంటి, విజయాన్ని అందించే ఆంజనేయ స్వామిని కొలిచినట్టు అయితే ప్రజలందరూ సుభిక్షంగా ఉంటారని మనందరం బలంగా నమ్ముతాం. అందుకే తెలంగాణలోని ప్రతి గ్రామంలో ఆంజనేయస్వామి గుడి ఉంటుంది. కరోనా కష్టసమయంలో తెలంగాణ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలంటే హనుమాన్ పారాయణం చేయాలని కొండగట్టు ఆలయ పూజారి జితేంద్రయ్య సూచించారు. ఆంజనేయ స్వామి పారాయణానికి మించిన మందు లేదు అని ఆయన చెప్పారు. ఆనాటి నుంచి నేటి వరకు కొండగట్టు అంజన్న సేవా సమితి పేరుతో జితేంద్రయ్య నేతృత్వంలో అందరం కూడా పారాయణం చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటున్నాం అని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత. @RaoKavitha pic.twitter.com/Y0h23zoMXL
— Namasthe Telangana (@ntdailyonline) May 10, 2023