MLC Kavitha | హైదరాబాద్ : సూర్యాపేట మండలం ఇమాంపేట ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలకు చెందిన మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ఒకే పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు కొద్ది రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.
తెలంగాణ సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో ఏం జరుగుతోంది..? విద్యార్థులు ఎందుకు ఇలా వరుసగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు..? అని కవిత ఆందోళన వ్యక్తం చేశారు. పూర్తిస్థాయి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లేకపోవడంతో ఇలాంటి అనేక సమస్యలను ప్రభుత్వం పట్టించుకోలేకపోతుందన్నారు. తక్షణమే పూర్తిస్థాయి సంక్షేమ శాఖ మంత్రిని నియమించడంతో పాటు విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చే దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని కవిత సూచించారు.
సూర్యాపేట మండలం ఇమాంపేట ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలకు చెందిన మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం. ఒకే పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు కొద్ది కాలం వ్యవధిలోని ఆత్మహత్య చేసుకున్నారు.
తెలంగాణ సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో ఏం జరుగుతోంది ? విద్యార్థులు ఎందుకు ఇలా వరుసగా…
— Kavitha Kalvakuntla (@RaoKavitha) February 18, 2024