హైదరాబాద్: బతుకమ్మ సంబరాలకు భారత్ జాగృతి (Bharath Jagruthi) సన్నాహాలు మొదలుపెట్టింది. భారత్ జాగృతి ఆధ్వర్యంలో రాబోతున్న బతుకమ్మ పాటకు (Bathukamma Songs) సంబంధించిన వీడియోను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. ప్రముఖ గాయకులు తేలు విజయ, పద్మావతి, మౌనిక యాదవ్, సౌమ్యతోపాటు భారత్ జాగృతి సాంస్కృతిక విభాగం జాతీయ కన్వీనర్ కోడారి శ్రీనుతో కలిసి కవిత పాటపాడారు. జాగృతి యాప్లో ఇప్పటికే దాదాపు 150 బతుకమ్మ పాటలు ఉన్నాయి.
కాగా, ప్రజల సహకారంతో అరుదైన, ప్రాచీన, కొత్తగా పూర్తిచేసిన బతుకమ్మ పాటలను సేకరిస్తున్నది. దీనికోసం ప్రత్యేక వాట్సాప్ నంబర్ +91 8985699999ను కేటాయించింది. ఆ నంబర్కి వాట్సాప్ ద్వారా పాటలను పంపించాలని ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తి చేశారు. అంతేకాక తమకు ఇష్టమైన బతుకమ్మ పాటలను సామాజిక మాధ్యమాల్లో భారత్ జాగృతికి ట్యాగ్ చేస్తూ పోస్టులు చేయాలని పిలుపునిచ్చారు.
Rejoicing the beautiful #Bathukamma journey with our popular and celebrated folk singers! @BharatJagruthi has a repository of Bathukamma Songs, with great efforts to save the native language and tunes we collected songs from our older generation. If you think that we may have… pic.twitter.com/KhH70p8A7a
— Kavitha Kalvakuntla (@RaoKavitha) August 14, 2023
ఈ సందర్భంగా బతుకమ్మ పాటలు సేకరణ, రూపకల్పనలో క్రియాశీలకంగా వ్యవహరించిన జాగృతి సాంస్కృతిక విభాగం జాతీయ కన్వీనర్ కొడారి శ్రీనును అభినందించారు.