హైదరాబాద్: రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ 131వ జయంతిని పురస్కరించుకుని అసెంబ్లీలో పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులు అర్పించారు. అసెంబ్లీ ఆవరణలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత పూల మాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కార్యదర్శి, పలువురు అధికారులు పాల్గొన్నారు.