BRS MLC Kavitha | కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చెప్పిన ముహబ్బత్ కా దుకాణ్`ను దుకాణం అని అనుకొని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దుకాణం తెరిచి కాంగ్రెస్ సీట్లు అమ్ముకున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. రేపు అధికారంలోకి వస్తే తెలంగాణను కూడా అమ్ముకుంటారని గారు నిప్పులు చెరిగారు. శనివారం బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జిల్లా పరిషత్ చైర్మన్ దావ వసంతతో కలిసి జగిత్యాల పట్టణంలో కవిత ఎన్నికల ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. జగిత్యాల అభివృద్ధిపై చర్చించడానికి ఎమ్మెల్యే సంజయ్ ఏ సెంటర్ కి రమ్మంటే అక్కడికి వస్తారని, జీవన్ రెడ్డి కూడా రావడానికి సిద్ధమా అని సవాల్ విరిసారు. సవాలును స్వీకరిస్తారా అని జీవన్ రెడ్డిని ప్రశ్నిస్తారు. జగిత్యాల మాస్టర్ ప్లాన్ను రద్దు చేశామని, కాబట్టి జీవన్ రెడ్డి చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. జీవన్ రెడ్డి అన్ని అబద్దాలు చెబుతారని, ఉద్యోగ నియామకాల విషయంలోనూ అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు.
అనేక సార్లు గెలిచినా, మంత్రిగా పనిచేసినా జగిత్యాలకు జీవన్రెడ్డి చేసిందేమీ లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. జగిత్యాలను జిల్లా చేయాలని ఎవరూ ధర్నాలు చేయలేదని, అయినా సీఎం కేసీఆర్ పరిపాలన సౌలభ్యం కోసం, అభివృద్ధి కోసం జిల్లా కేంద్రాన్ని చేశారని, దాంతో రోడ్లు, మినీ ట్యాంక్ బండ్ వంటి అభివృద్ధి జరిగిందని చెప్పారు. జిల్లా కేంద్రం కావడం వల్ల మెడికల్ కాలేజీ వచ్చిందని, దాంతో 150 మంది డాక్టర్లు పనిచేస్తున్నారని, 800. మందికి కొత్తగా ఉద్యోగాలు వచ్చాయని వివరించారు.